Here you can get the list of Famous people from our Srikakulam district. Please note that the below list provided for information purpose only, we have tried to provide 99% accurate information and there is no guarantee for the content below. It is your own personal responsibility to evaluate the accuracy, so please confirm before proceeding.
Please refer to our respective Disclaimer [1] for details
In this page most of the information provided by Dr.Seshagirirao-MBBS (Visit his website [2])
- Sardar Gouthu Latchanna, Indian Freedom Fighter.
- Garimella Satyanarayana, Poet and Freedom Fighter.
- Gidugu Rammurty, Telugu Linguist
- Balivada Kantha Rao, Telugu Novelist and Playwright.
- Pullela Setharamayya, Advoate
- Pullela Venkata Ramanayya, Criminal Lawyer
- Justice Kotapalli Punnayya, Former Judge of AP High Court
- Karnam Malleswari, Weight Lifter
- Grandhi Mallikarjuna Rao (GMR) [3]
Amarapu Satyanarayana [4]
అమరపు సత్యనారాయణ అప్పటి శ్రీకాకుళం జిల్లా బొబ్బిలి తాలూకా పాములవలస గ్రామంలో అప్పలనాయుడు, కన్నమ్మలకు 1937 ఏప్రిల్ 12 న జన్మించారు. చిన్నతనంలో పాటలు,పద్యాలు గొంతెత్తి అందరూ వినెలా పాడేవారు. అతని కంఠ మాధుర్యాన్ని గుర్తించి పక్కి సత్యన్నారాయన అనె ఉపాధ్యాయుడు శిక్షణనిస్తే మంచి కచ్ళాఇంకారుడవుతాడని చేరదీసాడు. ఒకవైపు నాటకాల్లో అవకాశాలిస్తూ మరొకవైపు నోము సూర్యారావు వద్ద శిక్షణ యిప్పించాడు. పద్యం భావయుక్తంగా పాడటానికి సంగీతం చాలా అవసరమని అందులో శిక్షన పొందారు. శ్రావ్యమైన కంఠం,చూడచక్కని రూపం,భావాత్మక గానం ఆయనను అందరిలో మేటిగా నిలిపింది. ఆయన ఏ పాత్ర ధరించవలసి వచ్చినా ఆహార్యం మొదలుకొని అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ వహించెవారు.నిండుతనం కోసం పరితపించెవారు.అందువల్ల ఆయన పాత్రలకి,ఆయనకు ప్రజాదరణ పెరిగింది. అపరపు సత్యనారాయణ అనేక పాత్రలు ధరించినా ఆయనకు కొన్ని పాత్రలతొ విడదీయరాని సంబంధం పెరిగింది.ముఖ్యంగా రామాంజనేయ యుద్ధంలో రాముడు, గయోపాఖ్యానం నాటకంలో కృష్ణుడు, అర్జునుడు, చింతామణి నాటకంలో బిల్వమంగళుడు పాత్రలు మంచి ఆదరణ పొందాయి. 20.10.2012 న రాజాం లో కన్ను మూశారు.
అవార్డులు,రివార్డులు,సన్మానాలు
1960 లో ఆంధ్ర రాష్ట్ర పరిషత్ పోటీల్లో స్వర్ణ పతకం పొందారు.
1965 లో పొద్దుటూరుకు చెందిన శ్రీ రాయన నాటక పరిషత్ వారిచే స్వర్ణ కిరీటం పొందారు.
రూర్కెలా లోని శ్రీ వెంకటేశ్వర ఫైనాంస్ సంస్థ ‘నాటక కళా విశారదా అనే బిరుదుతో సత్కరించింది.
అప్పటి గవర్నర్ పి.సి.అలెగ్జాండర్ చేతుల మీదుగా ‘రాఘవ అవార్డు ‘ అందుకున్నారు.
అప్పటి సినీ నటులైన కాంతారావు,ధూళిపాళ,అల్లురామలింగయ్య,చంద్రమోహన్,రాజనాల వంటివారితో కలసి రంగస్థలం పై నటించారు.
గయో పాఖ్యానంలో అర్జునుడు, కర్ణసందేశంలో కర్ణుడు పాత్రల సంభాషనలు రికార్డులు తయారయ్యాయి.
వృత్తి పరంగా రాజాం నందు కళాశాల ఉపన్యాసకులుగా పనిచేసి పదవీవిరమణ పొందినా జన హృదయాలలో శాశ్వతంగా నిలిచి పోయారు.
Adhikarla Narasimharao [4]
Anandh.G(singer) [4]
పండంటి కాపురం సినీమా తో గాయకుడి గా సినీ రంగ ప్రవేశం చేసిన ఆనంద్ సంగీత దర్శకుడు కుడా . స్వరమాధురిఫౌండేషన్ వ్యవస్థాపకుడైన ఈయన ఎంతో మందిని సినీ , దూరదర్శన్ రంగాలకు పరిచయం చేశారు . షిరిడి సాయిబాబా, తిరుపతి బాలాజీ, విష్ణుపురాణం , గాంధర్వ మాలతీయం వంటి సీరియల్ కి సంగీతం అందిస్తున్నారు . ఎన్నో భక్తీ పాటల అల్బుమ్స్ చేస్తున్నారు .
ప్రొఫైల్ :
పేరు : ఆనంద్ , గేదెల (జి),
సొంత ఊరు : తులగం గ్రామము – హిరమండలం దరి ., శ్రీకాకుళం జిల్లా .
సోదరుడు : బాలరాజు (మాస్టారు) రాగోలు (ఆర్.టి.సి.కాలనీ-శ్రీకాకుళం జిల్లా ),
ఫిల్మోగ్రఫీ : పాటలు పాడిన కొన్ని సినిమాలు >
పండంటి కాపురం ,
అమెరిక అమ్మాయి ,
దిక్కులు చూడకు రామయ్యా అనే పాట ,
విటలా … విటలా … పాండురంగ విట్టలా అనే పాట ,
కొన్ని ఆల్బం లు :
1.హోసంన్డ దేవుడు ఫ్రొం ఆల్బం జీసస్ సవెస్ (కరుణామయుడు, రాజాధిరాజు, మేరీ మత అండ్ బాల యేసు) (తెలుగు) 36
2.ప్రభు యేసుని ఫ్రొం ఆల్బం (తెలుగు) 15
3.నన్ను మరువలేదు ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 8
4.యేసు విభుని ఫ్రొం ఆల్బం ప్రైస్ ది లోర్డ్ (తెలుగు) 7
5. మానస మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 4
6.సమానులేవారు ప్రభో ఫ్రొం ఆల్బం (తెలుగు) 3
7.సీతాపతి నీకు ఫ్రొం ఆల్బం దొంగలకు దొంగ (ట్ల్గ్) (తెలుగు) 2
8.మాడు తండ్రి దేవ ఫ్రొం ఆల్బం (తెలుగు) 1
9.ప్రభు వాక్యమున్ ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
10.స్తోత్రించుము ఓ మానస ఫ్రొం ఆల్బం (తెలుగు) 0
11.హృదయమనేడు
12.రాగము తలములో
Balivada Kantharao [4]
రచనలు
* జన్మ భూమి
* అమ్మి
* కావడి కుండలు – 1951
* దొంగలు – 1952
* శిశు విక్రయం – 1952
* పెళ్ళి -1953
* అంతరాత్మ- 1957
* ఇంటికోసం – 1967
* మంటలు – 1968
* ముంగిస కథ – 1969
* నాలుగు మంచాలు 1972 (ఆంధ్ర సచిత్ర వార పత్రికలో ధారావాహికం)
* విలువెంత – 1975
* దగాపడిన తమ్ముడు – ?
* నిగురు తేనె – 1977
* భేదాఘాట్ మొసలి – 1977
* షోవనార (1980)
* కెంపు (1984)
* తేనె పట్టు (1989)
* సుఖ జీవనం (1989)
* ప్రతీక్ష (1990)
* దృష్టి (1991)
* చక్రతీర్థం (1992)
* గోపురం (1994)
* చైత్ర పర్వం (1998)
* తెల్ల కలువ (1998)
* దేవుళ్ళ దేశం (1998)
* Love in Goa (1998)
* అజంతా (1998)
* ఎల్లోరా (1998)
Baratam Neelakantaswamy [4]
నీలకంట స్వామీ గారు 08 / 11 / 1918 లో జన్మించారు . తన 89 వ యేట 05/01 / 2007 తేదీన చనిపోయారు . సుమారు 50 సం.లు హోల్ సేల్ బట్టల వ్యాపారము చేశారు . ఈయన భార్య పేరు శశి రేఖ గారు . వీరికి ముగ్గురు కుమారులు , ఐదుగురు కుమార్తెలు .
పెద్దకుమారుడు — అప్పన్న శెట్టి , శ్రీ శ్రీనివాస మెడికల్ ఏజెన్సీ – మందుల వ్యాపారము ,
రేండెవ కుమారుడు — వెంకటరమణ మూర్తి , బి.యన్.యస్.సన్స్ – మందుల వ్యాపారము ,
మూడవ కుమారుడు — లక్ష్మణరావు , బి.యన్.యస్. ఏజెంసేస్ పేరిట – మందుల వ్యాపారము ,
కుమార్తెలు – అల్లుళ్ళు
1.జామి రాజేశ్వరి – దశరధుడు , శ్రీ కామేశ్వరి మెడికల్ అగేన్సేస్ , శ్రీకాకుళం ,
2. నారాయనశెట్టి శాకున్తల్ – సత్యనారాయణ , మెహర్ మెడికల్ ఎంటర్ ప్రైజెస్ , శ్రీకాకుళం ,
3. వైష్యరాజు అనసూయ – జగ్గరాజు , ఎరువుల వ్యాపారము , బ్రాహ్మణతర్లా ,
4. గేమ్బలి చంద్రావతి – మోహనరావు , లక్ష్మి మెడికల్ హాల్ , బొబ్బిలి .
5 . పతనాన లకష్మీకుమారి – డా.రత్న సోమేశ్వరరావు .. శ్రీనివాస నర్సింగ్ హోం కాశిబుగ్గ ,
నీలకంతం గారి సేవ మరియు ధర్మ కార్యక్రమాలు ->
ప్రధాన గాన సంగము వ్యవస్తాపక సభ్యులు ,
సత్యసాయి మందిరం (బాపూజీ కళా మందిరం ప్రక్కన) సహా నిర్మాణ కర్త ,
ఉపనిషత్ మందిరం నిర్మాణ సహాయ కర్త ,
బరాటం నీలకంతస్వామి ఉచిత వైద్య సేవా కేంద్ర వ్యవస్తాపకులు ,
శ్రీ వర సిద్ది వినాయక పంచాయతన దేవాలయ(PNcolony) వ్యవస్తాపక ట్రస్టీ సభ్యుని గా ,
కాలింగ వైశ్య కళ్యాణ మండపం నిర్మాణ దాత గా ,
శ్రీకాకుళం వయోవృద్ధుల ఆశ్రమం నిర్మాణ దాత గా ,
ఎన్నో పాడుపడిన , దీనావస్తలో ఉన్న దేవ్వాలయాలు పునర్నిర్మాణ ము లో పాలు పంచుకున్నారు .
ఎంతో మంది పేద విద్యార్దుల చదువుల సహాయ దాత గా సేవలందించారు .
Vandrangi Ramarao,భావశ్రీ [4]
తెలుగు భాషలో ప్రత్యేక బి.ఎ డిగ్రీతో ఉత్తీర్ణుడైన భావశ్రీ తెలుగు, సంస్కృతంతో పాటు హిందీ మరియు ఆంగ్ల భాషలలో కూడా ప్రవేశం ఉన్నది.
పేరు : వాండ్రంగి రామారావు
జననం : జనవరి 26, 1935
నివాసం : సంతవురిటి (గ్రామం), పొందూరు, శ్రీకాకుళం జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ – 532 168
ఇతర పేర్లు : భావశ్రీ
ప్రాముఖ్యత : రచయిత, కవి, రాష్ట్ర పురస్కార గ్రహీత
తండ్రి : సూర్యనారాయణ (మానవతావాది, సామాజిక సేవకులు)
తల్లి : అమ్మన్నమ్మ (గృహిణి)
Bongu Suryanarayana [4]
సుప్రభాత సహిత సూర్యశతకం ,
శ్రీరామక్రిష్ణ యుద్ధం ,
నవ్యాంధ్ర సుమతీ శతకం ,
రావివలస ఎండల్ మల్లిఖార్జున స్వామివారి క్షేత్ర మహత్యం ,
లీలావతార గాధ ,
వెంకటేశ్వర శతకం ,
శివక్షేత్ర మహర్యం ,
వంటి పద్యకావ్యాలు పుస్తక రూపం లో విడుదలై ఆయనకు ఎనలేని కీర్తిని తెచ్చిపెట్టాయి .
టెక్కలి బోర్డు హైస్కూల్ లో ఎస్.ఎల్ ఎల్.సి . వరకు చదివిన ఇతడు దూరవిద్యద్వారా ఆంధ్ర విశ్వవిద్యాలయం లో భాషాప్రవీణ కొర్సు పూర్తిచేసారు . చిన్నతనం లో తనతండ్రి నర్సింహం ప్రోత్సాహంతో తెలుగుభాషపై మక్కువ పెంచుకుని తెలుగుభాషకీర్తిని నలుదిసలా విస్తరించాలని నిరంతర కృషి చేస్తున్నారు . ఇందుకోసం టెక్కలి పాతజాతీయ రహదారిపై పౌరాణిక గ్రంధాలయం ఏర్పాటుచేసి పురాతన గ్రంధాలను అందరికీ అందుబాటులో ఉంచారు .
ప్రశంసలు … పురస్కారాలు :
2006 లో విశాఖపట్నం శారదాపీఠం చేపట్టిన కార్యక్రమం లో ఆచార్య సార్వభౌమ వేదుల సుబ్రహ్మణ్య శాస్త్రి చే ” మధురకవి ” బిరుదు ,
2006 లో శారదాపీఠం వారిచే ” నవ్యాంధ్రకవి ” బిరుదు ,
2006 లో సాహిత్య బ్రహ్మ వి.వి.ఎల్.నర్షింహరావు హైదరాబాద్ వారి ” అపరపింగళసూరన ” బిరుదు ,
2008 లో కడప లో మహాకవి గడియారం వేంకటశేషశాస్త్రి స్మారక పురస్కారం అందుకున్నారు .
2009 లో శ్రీనన్నయభట్టారక పీఠం తణుకు వారి తంగిరాల వెంకటస్వామియాజి పద్యకావ్య్ పురస్కారం తో పాటు ” కవిశేఖర ” బిరుదు .
టెక్కలి పాతజాతీయ రహదారి ప్రక్కన 1983 లో తన సొంత స్థలం లో సూర్యనారాయణమూర్తి ఆలయాన్ని నిర్మించిన ఇతను ప్రస్తుతం ఆలయం లో అర్చకత్వం నిర్వహిస్తూ భానుడి సేవలో తరిస్తున్నారు . తన తండ్రి నర్సింహం వద్ద వంశపారంపర్యం గా నేర్చుకున్న విద్యతో మహర్షి మూలికా వైద్యశాలను ఏర్పాటు చేసారు .
Buravalli Krishnamurty [4]
పుట్టిన ఊరు పోలాకి మండలం లోని దీర్ఘాశి గ్రామము . సాదారణ శిష్ట కరణం కుటుంబములో జన్మించి I.R.S ఆఫీర్ గా దేశానికి సేవలందించారు .
C.R.M.Patnaik [4]
C.S.N patnaik [4]
ప్రవృత్తికి భిన్నమైన వృత్తిలో ఏడేళ్లు నలిగిపోయాను. అదీ బాగా నేర్చుకోవలసిన వయసులో. కానీ కళాభిరుచిని గమనించే సహృదయులు ఎక్కడో ఉండకపోరు. కాకపోతే వాళ్లు మనకు తారసపడడమే మన జీవితంలో ముఖ్యమైన మలుపుకి కారణమవుతుంది. నా జీవితంలోనూ అంతే. గానుగెద్దులా మారిపోనున్న నా జీవితాన్ని అయ్యదేవర కామేశ్వరరావు పంతులు గారనే మహానుభావుడు కాపాడి నాలో ఉన్న కళాకారుడికి ప్రాణం పోశారు.
మా ఊరు శ్రీకాకుళం జిల్లా ఉర్లాం దగ్గర ఉన్న బాడాం. హైస్కూలు చదువంతా నరసన్న పేటలో సాగింది. సాగిందంటే సాగింది. ఎందుకంటే జాతీయ ఉద్యమం చాలా తీవ్రంగా సాగుతున్న దశ అది. ఆ ఉద్యమంలో పాల్గొనడం గొప్ప ఆనందంమే కాని చదువు అయితే సరిగ్గా సాగలేదు.
నరసన్న పేటలో మా డ్రాయింగ్ టీచర్ సాంబశివరావు నాకు ఆదిగురువు. ఆయన పౌరాణిక నాటకాలకు నేపథ్య తెరలు కూడా చిత్రించేవారు. ఆయన ఆ తెరల మీద చిత్రించిన రాజుల ఆస్థానాలు, అడవులు, అంతఃపురాలు అద్భుతంగా ఉండేవి. ఆయనతోనే ఎక్కువ సమయం గడిపేవాడిని. చదువుకి పనికిరానని మా నాన్న తొందరగానే గ్రహించి అంతే తొందరగా నన్ను కరణాన్ని చేశారు. చిక్కాలవలస గ్రామ కరణం బాధ్యతలు అప్పగించారు. అయిష్టంగానే ఏడు సంవత్సరాలు చేశాను. కాని చిత్రకళ పట్ల నా మక్కువ క్రమంగా పెరిగిందే తప్ప తగ్గలేదు. అప్పట్లో నార్త్ వైజాగ్ డిస్ట్రిక్లో శ్రీకాకుళం ఒక తాలూకా. జమాబందీ శ్రీకాకుళంలో జరిగేది – సుమారు పదిహేను రోజులు ఉండేది అది.
నేను రోజూ నాగావళి నది ఒడ్డున నాగేశ్వర ఫోటో స్టూడియో పక్కనుంచి ఆఫీసుకి వెళుతుండేవాడ్ని. అక్కడ కూర్మపు నరసింహంగారనే గొప్ప చిత్రకారుడుండేవారు. నేను రోజూ వస్తూ పోతూ చాలాసేపు అక్కడే గడిపేవాడిని. నా ఆసక్తి గమనించి ఆయన నేర్చుకుంటావా అని అడిగారు. నేర్చుకుంటానన్నాను. నాలోని కళాకారుడ్ని ఆయన గమనించారేమో! ఇక్కడుంటే ఇంతే, మద్రాసు పోయి ఫైన్ఆర్ట్స్లో చేరమన్నారు. కాని ఎలా సాధ్యం? మా నాన్న సాహసించలేకపోయారు. తాలూకా ఆఫీసులో నేను వేసిన గాంధీ చిత్రపటం పటం కట్టి ఉండేది. తహసీల్దార్ కామేశ్వర పంతులుగారు అది చూసి జమాబందీ కెళ్లినప్పుడు నన్నడిగారు. నాకు మద్రాసు వెళ్లాలనుందన్నాను. వారం తరువాత మా ఇంటికి కలెక్టర్ ఆఫీసునుండి సమన్లు వచ్చాయి. ఇంట్లో కంగారు. ఆందోళనతోనే బయలుదేరాం. ఆ సమన్లు చింపేసి ‘అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది. మద్రాసు పంపించండని మా నాన్నని ఒప్పించారు తహసీల్దారుగారు.
మా నాన్న ధాన్యం అమ్మి నాకు రెండు వందల రూపాయలిచ్చారు. వైజాగ్నుంచి మద్రాసు పన్నెండు రూపాయల చార్జి. 1950 మార్చిలో మద్రాసులో దిగాను. మద్రాస్ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ మహామహులతో కళకళలాడుతుండేది. ప్రిన్సిపాల్ దేవీప్రసాద్రాయ్ చౌధురి. ఉపాధ్యాయులు రాంగోపాల్, ధన్పాల్ , ఫణిక్కర్ … ఒకరిని మించిన వారొకరు. ఫ్రీ హ్యాండ్ ఔట్లైన్, మోడల్ డ్రాయింగ్ పరీక్ష పాసైనందువల్ల, ప్రవేశ పరీక్షలో సెకండ్ ర్యాంక్ రావడం వల్ల నేరుగా రెండో సంవత్సరంలోనే చేర్చుకున్నారు. అప్పటికే పెళ్లయ్యింది. భార్యని తీసుకుపోయాను కానీ ఆర్థికంగా చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సమయంలో నన్ను బాగా ఆదుకున్నవారు నార్ల వెంకటేశ్వరరావు, ఖాసా సుబ్బారావు, శివలెంక శంభుప్రసాద్, పి.వి. రాజమన్నార్ గార్లు. నా పెయింటింగ్స్ని కొని ఆ రకంగా నన్ను గట్టెక్కించారు. దేవీప్రసాద్గారు చేసిన గొప్పగొప్ప శిల్పాలు చూసే భాగ్యం కూడా కలిగింది. అవి చూసి ఎంతో నేర్చుకున్నాను.
చదువు పూర్తయ్యాక 1955లో తాడేపల్లిగూడెం దగ్గరి పెంటపాడులో పి.జి. ప్రాథమిక శిక్షణా కళాశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. జీతం నెలకు 155 రూపాయలు. హైస్కూలు టీచర్లు, హెడ్మాస్టర్లు, డి.ఇ.ఒలు మూడు నెలల పాటు శిక్షణ కొచ్చేవారు. అక్కడంతా గాంధేయ విధానం. ఎవరి పని వాళ్లే చేసుకోవాలి. రూరల్లైఫ్, డిగ్నిటి ఆఫ్ లేబర్ అనే అంశం మీద తరగతులు జరిగేవి. మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దనరెడ్డి ఇక్కడి విద్యార్థే. రాట్నం తిప్పడం నూలు వడకడం చేసేవాడ్ని కొన్నాళ్లు. నా చెప్పులు నేనే కుట్టుకునే వాడ్ని. గాంధీ శతజయంతి సంవత్సరంలో చాలా చిత్రాలు వేశాను. నా జీవితంలో స్వర్ణయుగమంటే అక్కడ పని చేసిన ఏడు సంవత్సరాలే. పాఠ్య బోధనలో భాగంగా విద్యార్థులతో కలిసి గ్రామాలు సందర్శించడం, ప్రజల జీవన విధానం పరిశీలించడం, గ్రామాలు శుభ్రపరచడం… అక్కడి మనుషుల్ని, పరిసరాల్ని బొమ్మలుగా చిత్రించడం … నిత్యనూతనంగా ఉండేది జీవితం. నా జీవిత విధానమే కాదు, నా వస్త్రధారణ కూడా అక్కడే మారింది. మా ప్రిన్సిపాల్గారు ‘గాంధీయిజం గురించి మనం బోధిస్తున్నప్పుడు మన వస్త్రధారణగూడా అలాగే ఉండాలి’ అని అన్నారు. ఇక అప్పటి నుండి ఖద్దరు పంచె, లాల్చీయే ధరిస్తూ వచ్చాను.
1962 నుండి 1983 వరకు అంటే పదవీ విరమణ చేసేవరకు గుంటూరు విమెన్స్ డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఇన్ స్కల్ప్చర్ చేశాను. మొదట్లో నేను వేసినవన్నీ పెయింటింగ్సే. తరువాత కంచు శిల్పాలపై దృష్టి పెట్టాను. అప్పట్లో మన దేశంలో మూడు నాలుగు ప్రధాన నగరాల్లో తప్ప కంచు శిల్పాలు లేవు. ‘ప్యాలెట్ నైఫ్తో పోర్ట్రెయిట్స్’ నా స్పెషలైజేషన్. ఇందులో త్రీడైమెన్షన్స్ ఉంటాయి. ఇదే పద్ధతిలో ఫోర్ డైమెన్షన్స్ ప్రయత్నిస్తే ఎలా ఉంటుందనే ప్రయత్నమే కళాకారుడిగా నా ప్రత్యేకతని నిలబెట్టింది. అందుకు జానపద శైలి ఎంచుకున్నాను. కళింగాంధ్ర జీవనశైలిని ప్రపంచ వ్యాప్తం చేశాను.
ఈ కళ ఖరీదయినదైనా సొంత ఫౌండ్రీ ఉండేది నాకు. ఆర్డర్లు కూడా అదే స్థాయిలో వచ్చేవి కాబట్టి కొనసాగించగలిగాను. మా గురువులంతా చాలా గొప్పవారు. రాంగోపాల్, ధన్పాల్, ఫణిక్కర్… వాళ్లు చాలా నిజాయితీగా నేర్పబట్టే మేము చాలా నేర్చుకోగలిగాము. సొంత బిడ్డల్లా సాకే నిస్వార్థమైన గురువులు లభించడం కూడా నా అదృష్టమే.
ఒకసారి పర్యవేక్షణాధికారి మా కాలేజీకి వచ్చి ‘మీ క్వాలిఫికేషన్ ఏమిటి?’ అనడిగారు ప్రిన్సిపాల్ని. నాపేరే నా క్వాలిఫికేషన్ అన్నారు మా ప్రిన్సిపాల్. అదీ దేవీప్రసాద్ రాయ్ చౌధురి గొప్పతనం. ఆయన శిల్పాలు తయారు చేసేటప్పుడు చూపే ఏకాగ్రత, పనిముట్లు పట్టుకునే విధానం, మెరుగులు దిద్దే పద్ధతి నిద్రాహారాలు మాని గంటల తరబడి చూసేవాళ్లం. మొదట్లో సిగాయ్, వ్యానే, రూబెక్స్ రెమ్, బ్రాంట్లను అనుకరించాను. పెయింటింగ్లో మా గురువు కే.సి.యస్. ఫణిక్కర్ శైలికి ఆకర్షితుడినయ్యాను. కాని కళాకారుడుగా రాణించడానికి అవసరమైన విషయాలు నా జీవిత మూలాల్లోనే ఉన్నాయని గ్రహించాను. అందుకే కళింగాంధ్ర జానపదశైలిని ఎన్నుకున్నాను. నా చిత్రాలకు, శిల్పాలకు నమూనాలన్నీ నేను పుట్టి పెరిగిన ప్రాంతాల్లోని జానపదులే. శిక్షణలో భాగంగా క్రాఫ్ట్, వుడ్వర్క్, వీవింగ్ లెదర్ వర్క్ అన్నీ నేర్పించేవాళ్లం గాని, నేను మాత్రం కంచుతో పాటు టెర్రకోట వుడ్ మాధ్యమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించేవాడిని.
దేశ విదేశాల్లో ఇప్పుడు నా శిల్పాలున్నాయి. అనేక చోట్ల ప్రదర్శనలు జరిగాయి. లలితకళా అకాడమీ అధ్యక్షునిగా, స్కల్ప్చర్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియాకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాను. చాలా పురస్కారాలు పొందాను. మా ఆఖరి అబ్బాయి రవిశంకర్ ఒక్కడే ఈ రంగంలోకి వచ్చి ఉన్నత విద్యను అభ్యసించాడు. ప్రస్తుతం ఆంధ్రాయూనివర్సిటీ ఫైనార్ట్స్ విభాగానికి అధిపతిగా ఉన్నాడు. అతని భార్యా మంచి చిత్రకారిణే. మిగిలిన ముగ్గురబ్బాయిలూ మంచి స్థానాల్లో ఉన్నారు. నేను విద్యార్థిగా ఉన్నప్పటినుండీ నాకు చేదోడు వాదోడుగా ఉన్న నా భార్య శ్యామల సహకారం మరువలేనిది. ఇప్పుడు 86 సంవత్సరాలు నాకు. 1925 డిశంబర్ 6న పుట్టాను. ఈ యేడాదే గుంటూరు నుండి విశాఖపట్నానికి మకాం మార్చాను. ఎం.వి.పి. కాలనీలో పట్నాయక్ ఆర్ట్గ్యాలరీ ప్రారంభించాను. తమిళనాడులో దేశవాళీ కళా దేవాలయం ఒకటి ఉంది. అలాంటిది మన రాష్ట్రంలో కూడా ఉంటే బాగుంటుందని నా ఆశ. విశాఖలోని కాపులుప్పాడ దగ్గర ఆర్ట్స్ విలేజ్ పూర్తి కావాలని నా కోరిక. ఈ ఆశలు, కోరికలు ఎప్పటికైనా తీరుతాయో లేదో…!
By ..- జి.ఎస్. చలం — Andhrajyoti sunday magazine20101219
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Balivada Kantharao [4]
Famous Persons
http://srikakulameminentpersons.blogspot.com/